ఇంటర్నెట్ సృష్టికర్తకు కరోనా!

ABN , First Publish Date - 2020-04-01T02:18:50+05:30 IST

ఇంటర్నెట్ సృష్టికర్తల్లో ఒకరైన వింట్ సెర్ఫ్ తాజాగా కరోనా బారిన పడ్డారు

ఇంటర్నెట్ సృష్టికర్తకు కరోనా!

న్యూఢిల్లీ: ప్రపంచాన్నే కుగ్రామంగా మర్చేసింది ఇంటర్నెట్. అయితే దీని సృష్టికర్తల్లో ఒకరైన వింట్ సెర్ఫ్ తాజాగా కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విటర్ ద్వారా ప్రకటించారు. ప్రస్తుతం తాను కోలుకుంటున్నట్టు తెలిపారు. ఇంటర్నెట్‌ వ్యవస్థకు వెన్నుముక లాంటి టీసీపీ/ఐపీ ప్రోటోకాల్ రూపకల్పలో ఆయన ముఖ్య పాత్ర పోషించారు. అంతేకాదు.. మనం చూస్తున్న ఇంటర్నెట్ ఆర్కిటెక్చర్‌కు వెనక కూడా ఆయన ఉన్నారు. ప్రస్తుతం ఆయన గూగుల్‌కు సలహాదారుగా వ్యవహరిస్తున్నారు. 


Updated Date - 2020-04-01T02:18:50+05:30 IST