ఖేల్రత్నకు వినేశ్
ABN , First Publish Date - 2020-06-01T09:41:57+05:30 IST
ఏస్ రెజ్లర్ వినేశ్ ఫొగట్ పేరును రాజీవ్ గాంధీ ఖేల్రత్న పురస్కారానికి జాతీయ రెజ్లింగ్ సమాఖ్య ప్రతిపాదించింది. ఈ 25 ఏళ్ల స్టార్ రెజ్లర్కు 2016లో అర్జున అవార్డు లభించింది. మహిళల 53 కిలోల విభాగం ప్రపంచ ర్యాంకింగ్స్లో ఆమె ప్రస్తుతం మూడో
న్యూఢిల్లీ: ఏస్ రెజ్లర్ వినేశ్ ఫొగట్ పేరును రాజీవ్ గాంధీ ఖేల్రత్న పురస్కారానికి జాతీయ రెజ్లింగ్ సమాఖ్య ప్రతిపాదించింది. ఈ 25 ఏళ్ల స్టార్ రెజ్లర్కు 2016లో అర్జున అవార్డు లభించింది. మహిళల 53 కిలోల విభాగం ప్రపంచ ర్యాంకింగ్స్లో ఆమె ప్రస్తుతం మూడో స్థానంలో ఉంది. గత ఏడాది జరిగిన రెజ్లింగ్ వరల్డ్ చాంపియన్షి్పలో వినేశ్ కాంస్య పతకం నెగ్గి టోక్యో ఒలింపిక్స్ బెర్త్ను సాధించింది. ఈ ఏడాది ఆరంభంలో న్యూఢిల్లీ వేదికగా జరిగిన ఆసియా రెజ్లింగ్ పోటీల్లోనూ వినేశ్ కాంస్యం కొల్లగొట్టింది. ఇక, మే 5న ప్రారంభమైన క్రీడా పురస్కారాల దరఖాస్తుల గడువు ఈనెల 3వ తేదీతో ముగియనుంది.