వెంకటరమణకాలనీలో వైభవంగా వినాయక ఉత్సవం

ABN , First Publish Date - 2022-09-03T18:37:17+05:30 IST

గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్ నగర పరిధిలోని మల్లాపూర్ వార్డు వెంకటరమణ కాలనీలో వైభవంగా ఉత్సవాలు కొనసాగుతున్నాయి....

వెంకటరమణకాలనీలో వైభవంగా వినాయక ఉత్సవం

హైదరాబాద్: గణేష్ నవరాత్రి ఉత్సవాల(Vinayaka festival) సందర్భంగా హైదరాబాద్ నగర పరిధిలోని మల్లాపూర్ వార్డు వెంకటరమణ కాలనీలో వైభవంగా ఉత్సవాలు కొనసాగుతున్నాయి. కాలనీవాసులు నిలువెత్తు గణనాథుడిని ప్రతిష్ఠించి ప్రతీరోజూ ప్రత్యేక పూజలు చేస్తున్నారు. కాలనీలో వినాయక ఉత్సవాల నిర్వహణకు కాలనీవాసులందరూ కలిసికట్టుగా కార్యక్రమాలు చేపట్టారు. వినాయకుడి విగ్రహం కోసం కాలనీ మాజీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి విరాళమందించారు. విద్యుత్ దీపాల అలంకరణకు కాలనీ ఉపాధ్యక్షుడు స్వామి సహాయం చేశారు.లంబోదరుని చేతిలో ఉన్న పెద్ద లడ్డూను శ్రీనివాసరావు అందించారు.అన్నదానం చేసేందుకు పలువురు కాలనీవాసులు ముందుకు వచ్చారు. 


భక్తిప్రపత్తులతో గణనాథుడికి పూజలు

ప్రతీరోజూ సాయంత్రం కాలనీ మైదానంలో అత్యంత భక్తిప్రపత్తులతో చేస్తున్న వినాయక పూజా కార్యక్రమంలో కుల,మతాలకు అతీతంగా కాలనీవాసులందరూ పాల్గొనడం విశేషం. కాలనీ సంక్షేమ సంఘం మాజీ అధ్యక్షుడు శ్యాంసుందర్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, సీహెచ్ సురేష్ లు మొదటిరోజు పూజా కార్యక్రమంతో గణేష్ ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. కాలనీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి, శివకుమార్, ఉపేందర్ రావు, మోహన్ రెడ్డి, హరీష్ రెడ్డి, బల్వంత్ రెడ్డి, సంక్షేమ సంఘం మాజీ ప్రధానకార్యదర్శి రామచంద్రారెడ్డి, జి రమేష్, శేఖర్ రెడ్డి దంపతులు వినాయక ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.


కాలనీలో వెల్లి విరిసిన ఆథ్యాత్మికత 

 గణేష్ మండపం వద్దకు పిల్లల నుంచి మహిళలు, పెద్దల దాకా అందరూ తరలివచ్చి వినాయకుడికి నిత్య పూజలు చేస్తుండటంతో వెంకటరమణ కాలనీలో ఆథ్యాత్మికత వెల్లివిరిసింది.నిత్యం వినాయక పూజలు...ప్రసాదాల పంపిణీ,అన్నదానంతో కాలనీలో భక్తి సందడి నెలకొంది.పిల్లలు ఆటపాటలతో గణపతి మండపం మైదానంలో సందడి ఏర్పడింది.పిల్లలు గణనాథుడిని కొలుస్తూ తమకు విద్యాబుద్ధులు ప్రసాదించాలని వేడుకుంటున్నారు. 



 కాలనీ సంక్షేమ సంఘానికి కొత్త కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక 

వినాయక ఉత్సవాల సందర్భంగా వెంకటరమణ కాలనీ సంక్షేమ సంఘానికి జరిగిన ఎన్నికల్లో ఎన్‌డిఆర్‌కే శర్మ అధ్యక్షతన కొత్త కార్యవర్గాన్ని సభ్యులు ఎన్నుకున్నారు. కాలనీ సంక్షేమమే పరమావధిగా పనిచేసేందుకు ఏర్పడిన కొత్త కాలనీ కార్యవర్గంలో ప్రధానకార్యదర్శిగా పి. ప్రభాకరరెడ్డి, ఉపాధ్యక్షుడిగా ఎస్ స్వామి, సంయుక్త కార్యదర్శిగా ఐ శ్రీనివాసరావు, కోశాధికారిగా జి సుమన్, సంక్షేమ సంఘం కార్యవర్గ సభ్యులుగా జి రమేష్, శివకుమార్ రెడ్డి, బల్వంత్ రెడ్డి, ఎండీ గౌస్, సురేష్ రెడ్డి, పీవీ రమణారావు, నర్సిరెడ్డిలు ఎంపికయ్యారు. 


Updated Date - 2022-09-03T18:37:17+05:30 IST