వినాయక్ నగర్‌లో దారుణం.. ప్రియురాలిని హత్య చేసిన మాజీ ప్రియుడు

ABN , First Publish Date - 2021-08-11T03:04:02+05:30 IST

నగరంలో దారుణ ఘటన జరిగింది. జీడిమెట్ల పరిధి వినాయక్ నగర్‌లో మంగళవారం ఓ మహిళ దారుణ హత్యకు గురైంది.

వినాయక్ నగర్‌లో దారుణం.. ప్రియురాలిని హత్య చేసిన మాజీ ప్రియుడు

జీడిమెట్ల: నగరంలో దారుణ ఘటన జరిగింది. జీడిమెట్ల పరిధి వినాయక్ నగర్‌లో మంగళవారం ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. ఈఘటన స్థానికంగా కలకలం రేపింది. హత్యకు సంబంధించి పోలీసులకు స్థానికులు సమాచారం అందించారు. వివరాల్లోకి వెళ్తే.. జీడిమెట్ల పరిధి వినాయక్ నగర్‌లో ఉంటున్న మహిళను హత్య చేసింది  ఆమె మాజీ ప్రియుడేనని పోలీసులు తెలిపారు. బీహార్‌కి చెందిన పూజ(21)గా పోలీసులు గుర్తించారు.


పూజ ఏప్రిల్‌లో రాజేంద్రన్‌వర్మ అనే వ్యక్తిని వివాహం చేసుకుని హైదరాబాద్ వచ్చిందన్నారు. అనంతరం పూజ మాజీ ప్రియుడు రాకేష్‌తో ఛాటింగ్, ఫోన్ మాట్లాడడం ప్రారంభించిందని పోలీసులు చెప్పారు. మాజీ ప్రియుడు రాకేష్ మరో స్నేహితుడితో కలిసి మంగళవారం హైదరాబాద్ జీడిమెట్లలోని పూజ ఇంటికి వచ్చి తనతో పాటు బీహార్‌కు రావాల్సిందిగా కోరాడన్నారు. పూజ నిరాకరించడంతో దిండుతో ఆమెను హత్య చేసి బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లాడని పోలీసులు తెలిపారు. క్లూస్ టీమ్ ఆధ్వర్యంలో ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-08-11T03:04:02+05:30 IST