రాకేష్ మృతదేహానికి Vinay bhaskar నివాళులు

ABN , First Publish Date - 2022-06-18T13:34:51+05:30 IST

అగ్నిపథ్ ఆందోళనల్లో పోలీసులు జరిపిన కాల్పుల్లో మరణించిన రాకేష్‌కు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ నివాళులు అర్పించారు.

రాకేష్ మృతదేహానికి Vinay bhaskar నివాళులు

వరంగల్: ‘‘అగ్నిపథ్’’ ఆందోళనల్లో పోలీసులు జరిపిన కాల్పుల్లో మరణించిన రాకేష్‌కు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ నివాళులు అర్పించారు. అనంతరం వినయ్ మీడియాతో మాట్లాడుతూ.. రాకేష్‌ను కేంద్ర ప్రభుత్వమే పొట్టనపెట్టుకుందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ అనాలోచిత విధానాలతో రైతులు, యువకులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కేంద్రం మొండి వైఖరిని అందరూ ఖండించాలని వినయ్ భాస్కర్ పేర్కొన్నారు. 


కాగా... ప్రస్తుతం ఎంజీఎంలో ఉన్న రాకేష్ మృతదేహాన్ని కాసేపట్లో భారీ ర్యాలీగా ఇంటికి తరలించనున్నారు. పెద్దఎత్తున టీఆర్ఎస్ కార్యకర్తలు ఎంజీఎంకు చేరుకున్నారు. ఈ క్రమంలో ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా భారీగా పోలీసులు మోహరించారు. రాకేష్ స్వగ్రామం ఖానాపురం మండలం దబ్బీర్ పేట అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. 

Updated Date - 2022-06-18T13:34:51+05:30 IST