నెల్లూరు జిల్లా బోగోలులో వన్యప్రాణులకు రక్షణ కరువు!

ABN , First Publish Date - 2022-05-10T03:33:43+05:30 IST

రిజర్వు ఫారస్టులో స్వేచ్ఛగా తిరగాల్చిన వన్యప్రాణులకు ఆహారం, నీరు కరువై జనారణ్యంలోకి వచ్చి కుక్కల దాడిలో కొన్ని గాయపడుతుండగా, కొన్ని మృతి చెందుతున్నాయి.

నెల్లూరు జిల్లా బోగోలులో వన్యప్రాణులకు రక్షణ కరువు!
1బిటిటిఆర్‌9. కుక్కల దాడికి గురైన చుక్కల దుప్పి (ఫైల్‌)

నీరు, ఆహారం కోసం జనారణ్యంలోకి..

కుక్కల దాడిలో గాయపడి మృతి చెందుతున్న వైనం

బిట్రగుంట, మే 9: రిజర్వు ఫారస్టులో స్వేచ్ఛగా తిరగాల్చిన వన్యప్రాణులకు ఆహారం, నీరు కరువై జనారణ్యంలోకి వచ్చి కుక్కల దాడిలో కొన్ని గాయపడుతుండగా, కొన్ని మృతి చెందుతున్నాయి. దీంతో వన్యప్రాణలకు రక్షణ కరువైన పరిస్థితి వెలుగు చూస్తోంది. బోగోలు మండలానికి పడమర, దక్షిణ శివారు ప్రాంతాల్లో ఉండే అడవులు కనుమరుగైపోయాయి. అటవీ శాఖ వారు అడవులను నరికి జామాయల్‌, వెదురు, నేరేడు, ఎర్రచందనం వంటి మొక్కలను నాటడంతో వన్యప్రాణుల నివాసాలు లేకుండా పోయాయి. అడవుల్లో జనసంచారం పెరగడంతో మూగజీవులు తల దాచుకొనేందుకు ఇబ్బంది ఏర్పడింది. వాగులు, వంకలు, గుంటలు పూడిపోవడంతో తాగేందుకు నీరు దొకరడం కూడా కష్టమైంది. బిట్రగుంట, రాచర్లపాడు రిజర్వు ఫారెస్టులో వందల సంఖ్యలో వన్యప్రాణలు ఉన్నాయి. వీటి సంరక్షణ విషయాన్ని అధికారులు గాలికి వదిలేసి చోద్యం చూస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఈక్రమంలో వేసవిలో తాగునీటి కోసం వన్యప్రాణులు జనారణ్యంలోకి వస్తున్నాయి. ఇప్పటికైన ప్రభుత్వం ప్రత్యేక అడవుల్లో నీటి గుంటలను ఏర్పాటు చేయించాల్సిన అవసరం ఎతైనా ఉంది.

Read more