వైసీపీ తీరుకు నిరసనగా గ్రామాల్లో గౌరవ సభలు
ABN , First Publish Date - 2021-11-29T06:00:42+05:30 IST
మాజీ ముఖ్యమంత్రి చంద్ర బాబు సతీమణిపై ఇటీవల వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్య లకు నిరసనగా ప్రతి గ్రామంలోను గౌరవ సభను నిర్వ హించనున్నామని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్ల మిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు.
- అనపర్తి గౌరవ సభలో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి
అనపర్తి, నవంబరు 28: మాజీ ముఖ్యమంత్రి చంద్ర బాబు సతీమణిపై ఇటీవల వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్య లకు నిరసనగా ప్రతి గ్రామంలోను గౌరవ సభను నిర్వ హించనున్నామని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్ల మిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. ఆదివారం అనపర్తిలోని పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ తెలుగు మహిళ అధ్యక్షు రాలు జుత్తుగ సూర్యకుమారి అధ్యక్షతన జరిగిన గౌరవ సభకు ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రసంగించారు. రాష్ట్రంలో అధికార పక్ష నేతల మాటలు సభ్య సమాజం సిగ్గుపడే విధంగా ఉన్నాయన్నారు. ఎన్నడూ రాజకీయా లతో సంబంధం లేని చంద్రబాబు సతీమణిపై తీవ్ర విమర్శలు చేయడం దారుణమన్నారు. మహిళా అధ్యక్షు రాలు సూర్యకుమారి మాట్లాడుతూ వైసీపీ పాలనలో మహిళల పట్ల నేతలు ప్రవర్తిస్తున్న తీరును తీ వ్రంగా ఖండిస్తున్నామన్నారు. రాజమహేంద్రవరం పార్ల మెంటరీ నియోజకవర్గ తెలుగు మహిళ ఉపాధ్యక్షురాలు కర్రి శేషారత్నం మాట్లాడుతూ చంద్రబాబు కన్నీరులో వైసీపీ కొట్టుకుపోయే రోజులు దగ్గర పడ్డాయని మహిళలను గౌరవించని వ్యక్తులైనా, పార్టీలైనా కాలగర్భంలో కలిసి పోవలసిందేనన్నారు.