నదిలో మొసలిని పట్టుకొని చంపి తిన్నారు...

ABN , First Publish Date - 2020-07-03T11:50:29+05:30 IST

గ్రామస్థులు నదిలో ఉన్న ఓ మొసలిని పట్టుకొని, దాన్ని చంపి మాంసం తిన్న ఉదంతం ఒడిశా రాష్ట్రంలోని మల్కాన్‌గిరి జిల్లాలో వెలుగుచూసింది.....

నదిలో మొసలిని పట్టుకొని చంపి తిన్నారు...

మల్కాన్‌గిరి (ఒడిశా): గ్రామస్థులు నదిలో ఉన్న ఓ మొసలిని పట్టుకొని, దాన్ని చంపి మాంసం తిన్న ఉదంతం ఒడిశా రాష్ట్రంలోని మల్కాన్‌గిరి జిల్లాలో వెలుగుచూసింది. పొడియా బ్లాకులోని కలదపల్లి గ్రామానికి చెందిన కొందరు ప్రజలు తమ గ్రామ సమీపంలోని సబేరీ నదిలో ఓ మొసలిని పట్టుకున్నారు. గ్రామస్థులు ఐదు అడుగుల పొడవు ఉన్న మొసలిని చేతులు నరికి చంపారు. అనంతరం మొసలి మాంసాన్ని ముక్కలు చేసి దాన్ని గ్రామస్థులే పంచుకొని వండుకొని తిన్నారు. గ్రామస్థులు మొసలిని చంపి తిన్నారని అందిన సమాచారం మేర తాము మూడు అధికారుల బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు సాగిస్తున్నామని అటవీశాఖ అధికారి ప్రదీప్ మిరాసీ చెప్పారు. నిందితులను త్వరలో పట్టుకుంటామని అటవీశాఖ అధికారి చెప్పారు. 

Updated Date - 2020-07-03T11:50:29+05:30 IST