రైల్వే స్టేషన్‌ను తమ ఖర్చుతో నడుపుతున్న గ్రామస్థులు.. వారు అలా ఎందుకు చేస్తున్నారో తెలిస్తే షాకవడం ఖాయం!

ABN , First Publish Date - 2022-04-11T08:42:47+05:30 IST

రాజస్థాన్‌లోని జస్లూ నానక్ రైల్వే స్టేషన్‌కు చాలా ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఎందుకంటే ఈ స్టేషన్‌‌ను రైల్వే శాఖ నడపడం లేదు.. ఆదాయం రావడం లేదని రైల్వే శాఖ 2005లో దానిని మూసేసింది.. దాంతో ఆ ఊరి ప్రజలు ఆ స్టేషన్‌ను దత్తత...

రైల్వే స్టేషన్‌ను తమ ఖర్చుతో నడుపుతున్న గ్రామస్థులు.. వారు అలా ఎందుకు చేస్తున్నారో తెలిస్తే షాకవడం ఖాయం!

రాజస్థాన్‌లోని జస్లూ నానక్ రైల్వే స్టేషన్‌కు చాలా ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఎందుకంటే ఈ స్టేషన్‌‌ను రైల్వే శాఖ నడపడం లేదు.. ఆదాయం రావడం లేదని రైల్వే శాఖ 2005లో దానిని మూసేసింది.. దాంతో ఆ ఊరి ప్రజలు ఆ స్టేషన్‌ను దత్తత తీసుకున్నారు.. నెలకు 1500 టిక్కెట్లు అమ్ముతూ ఆ రైల్వే స్టేషన్‌ను కాపాడుకున్నారు. గ్రామ ప్రజలు చందాలు వేసుకుని మరీ ఆ రైల్వే స్టేషన్‌ను నడుపుతున్నారు. 


జస్లూ నానక్ గ్రామంలో 1976లో రైల్వే శాఖ స్టేషన్‌ను ఏర్పాటు చేసింది. అయితే చిన్న గ్రామం కావడంతో తక్కువ ఆదాయం వస్తోందని చెప్పి 2005లో అక్కడ స్టాపింగ్ తీసెయ్యాలని నిర్ణయించింది. ఈ నిర్ణయంపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 11 రోజులు ధర్నాలు, నిరసనలు చేశారు. దీంతో రైల్వే శాఖ దిగి వచ్చింది. రోజుకు 50 చొప్పున నెలకు 1500 టిక్కెట్లు అమ్ముడయ్యేలా చూస్తే స్టాపింగ్ ఉంచుతామని చెప్పింది. దానికి గ్రామస్థులు అంగీకరించారు. 


గ్రామస్థులు ప్రతి నెల చందాలు వేసుకుని ఒకేసారి 1500 టిక్కెట్లు కొనేస్తారు. అనంతరం స్టేషన్‌లోనే ఒక వ్యక్తిని పెట్టి పాసింజర్లకు అమ్ముతుంటారు. ఇలా 17 ఏళ్లుగా రైల్వేకు నెలకు దాదాపు 30 వేల రూపాయల ఆదాయం సమకూరుస్తున్నారు. ఆ స్టేషన్‌లో రోజుకు పది రైళ్లు ఆగుతుంటాయి. ఆ రైల్వే స్టేషన్‌లో గ్రామస్థులే పలు సౌకర్యాలు ఏర్పాటు చేసుకున్నారు. కూర్చునేందుకు కుర్చీలు, తాగు నీరు ఏర్పాటు చేసుకున్నారు.


Updated Date - 2022-04-11T08:42:47+05:30 IST