పల్లె టు పట్నం

ABN , First Publish Date - 2022-01-18T06:00:34+05:30 IST

సంక్రాంతి పండుగ సెలవులు ముగియడంతో స్వగ్రామాలకు వెళ్లిన ప్రజలు పల్లెను వీడి పట్నం బాటపట్టారు. దీంతో జాతీయ రహదారులు వాహనాలతో కిటకిటలాడాయి.

పల్లె టు పట్నం
చౌటుప్పల్‌ మండలంలోని పంతంగి టోల్‌ ప్లాజా వద్ద బారులు తీరిన వాహనాలు

కిటకిటలాడిన జాతీయ రహదారులు

చౌటుప్పల్‌ రూరల్‌/బీబీనగర్‌, జనవరి 17: సంక్రాంతి పండుగ సెలవులు ముగియడంతో స్వగ్రామాలకు వెళ్లిన ప్రజలు పల్లెను వీడి పట్నం బాటపట్టారు. దీంతో జాతీయ రహదారులు వాహనాలతో కిటకిటలాడాయి. సోమవారం నుంచి ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యాలయాలు ప్రారంభంకావడం తో ప్రజలు పెద్ద సంఖ్యలో హైదరాబాద్‌కు పయనమయ్యా రు. కార్లు, బస్సుల్లో బయలుదేరారు. దీంతో విజయవాడ-హైదరాబాద్‌, వరంగల్‌-హైదరాబాద్‌ జాతీయ రహదారులు వా హనాలతో కిటకిటలాడాయి. ఫలితంగా నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలంలోని కొర్లపహాడ్‌, చౌటుప్పల్‌ మండలంలోని పంతంగి, బీబీనగర్‌ మండలంలోని గూడూరు టోల్‌ గేట్ల వద్ద వాహనాల రద్దీ నెలకొంది. పంతంగి వద్ద 16 గేట్లకు 10 గేట్లను హైదరాబాద్‌ వైపునకు వెళ్లే వాహనాలకు కేటాయించారు. ఇక్కడి నుంచి తిరుగు ప్రయాణికులతో 47వేల వాహనాలు రాకపోకలు సాగించాయి.   గూడూరు టోల్‌ప్లాజా వద్ద 12గేట్లకు ఆరు గేట్లను హైదరాబాద్‌ వైపునకు వెళ్లే వాహనాలకు కేటాయించారు. సుమారు 21వేల వాహనాలు ఈ టోల్‌ప్లాజా మీదుగా రాకపోకలు సాగించాయి.

Updated Date - 2022-01-18T06:00:34+05:30 IST