అర్హులందరికీ సంక్షేమ ఫలాలు

ABN , First Publish Date - 2020-11-29T06:02:07+05:30 IST

రాజకీయాలకు అతీతంగా రాష్ట్రంలో ఐదు లక్షల ఉద్యోగాలు కల్పించిన ఘనత సీఎం జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందని ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌గణేశ్‌ అన్నారు.

అర్హులందరికీ సంక్షేమ ఫలాలు
శిక్షణ శిబిరంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే గణేశ్‌

  సచివాలయ సిబ్బంది శిక్షణలో ఎమ్మెల్యే గణేశ్‌

నర్సీపట్నం అర్బన్‌ , నవంబరు 28 : రాజకీయాలకు అతీతంగా రాష్ట్రంలో ఐదు లక్షల ఉద్యోగాలు కల్పించిన ఘనత సీఎం జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందని ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌గణేశ్‌ అన్నారు. నర్సీపట్నం డివిజన్‌ స్థాయిలోని గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందికి  పట్టణంలోని పెదబొడ్డేపల్లిలో శనివారం ఏర్పాటైన శిక్షణ శిబిరంలో మాట్లాడారు. అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందేలా కృషి చేయాలని సిబ్బందికి సూచించారు.  డీఎల్‌పీవో శిరీషారాణి, డీఎల్‌డీవో సత్యనారాయణ, ఎంపీడీవో జయమాధవి,  ఏవో రమణబాబు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-11-29T06:02:07+05:30 IST