రుక్మాపూర్‌లో జాతర

ABN , First Publish Date - 2021-01-25T05:23:58+05:30 IST

రుక్మాపూర్‌లో జాతర

రుక్మాపూర్‌లో జాతర
మైలార్‌దేవరంపల్లిలో పూజలు చేస్తున్న గ్రామస్థులు

పెద్దేముల్‌: రుక్మాపూర్‌లో గ్రామదేవత జాతర ఆదివారం నిర్వహించారు. గ్రామదేవత(ఊరడమ్మ) జాతర సందర్భంగా ఊరంతా బంధువులు, ఆడపడుచులతో నిండిపోయింది. అమ్మవారికి నైవేద్యాల సమర్పణకు మహిళలు బోనాలతో డప్పు చప్పుళ్ల మధ్య ఆలయానికి చేరుకున్నారు. పోతురాజుల విన్యాసాలు అలరించాయి. నైవేద్యాల అనంతరం ఏర్పుల సాని భవిష్యవాణి విన్పించారు. కార్యక్రమంలో ఎంపీపీ టి.అనురాధ, సర్పంచ్‌ శివలీల, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పరి రమేష్‌, రమేష్‌, మల్లేశం పూజలు నిర్వహించారు.

  • ఘనంగా కట్ట మైసమ్మ ఉత్సవాలు

వికారాబాద్‌: ప్రజలు సోదరభావంతో యేటా కట్ట మైసమ్మ జాతర జరుపుకోవాలని సర్పంచ్‌ తిరుపతిరెడ్డి అన్నారు. ఆదివారం మైలార్‌దేవరంపల్లిలో కట్టమైసమ్మ జాతరలో భాగంగా మహిళలు బోనాలతో, పోతురాజుల విన్యాసాలు మధ్య ఆలయానికి చేరుకున్నారు. ప్రజలు సుఖసౌభాగ్యాలతో తులతూగాలని అమ్మవారికి మొక్కలు చెల్లించుకున్నారు.

Updated Date - 2021-01-25T05:23:58+05:30 IST