గ్రామ దేవతలకు ఘనంగా బోనాలు

ABN , First Publish Date - 2022-08-15T05:55:24+05:30 IST

గ్రామ దేవతలకు ఘనంగా బోనాలు

గ్రామ దేవతలకు ఘనంగా బోనాలు
ఎలిమినేడులో పోచమ్మ తల్లి బోనాల ఊరేగింపులో పాల్గొన్న ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ యువ నాయకుడు ప్రశాంత్‌కుమార్‌రెడ్డి

ఇబ్రహీంపట్నం/ఆదిభట్ల/యాచారం/షాబాద్‌/కందుకూరు, ఆగస్టు 14: ఇబ్రహీంపట్నంలో పోచమ్మ బోనాలు ఆదివారం జరిగాయి. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి కృప ప్రజలపై ఉండాలని, పాడి పంటలతో ప్రజలు సుఖశాంతులతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు. మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ యాదగిరి, కౌన్సిలర్లు భాస్కర్‌, ప్రసన్న చిన్న, నాయకులు మహే్‌షగౌడ్‌, మల్లేష్‌, రాజు, టోని, మహేష్‌, రాము పాల్గొన్నారు. బృందావన్‌ కాలనీలో పోచమ్మ బోనాలు జరిగాయి. ఆలయ చైర్మన్‌ ఆనంద్‌కుమార్‌, కౌన్సిలర్‌ మమత కాలనీ వాసులు ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు. మహిళలు అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఇబ్రహీంపట్నం మండలం ఎలిమినేడులో పోచమ్మ తల్లి బోనాలను ఆదివారం సాయంత్రం నిర్వహించారు. ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ యువ నాయకుడు ప్రశాంత్‌కుమార్‌రెడ్డి(బంటి), వైస్‌ఎంపీపీ వెంకటప్రతా ప్‌రెడ్డి, సర్పంచ్‌ అశోక్‌వర్ధన్‌రెడ్డి ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారికి పూజలు చేశారు. అలాగే ఆదిభట్ల మున్సిపాలిటీ పరిధి మంగళ్పల్లిలో పోచమ్మ బోనాలు నిర్వహించారు. యాచారం మండలం మేడిపల్లి, యాచారం, మొండిగౌరెల్లి, కొత్తపల్లి తదితర గ్రామాల్లో పోచమ్మ బోనాలను నిర్వహించారు. షాబాద్‌ మండలం మల్లారెడ్డిగూడ, సంకేపల్లిగూడ గ్రామాల్లో మల్లన్న బోనాలు, ఏట్ల ఎర్రవల్లిలో పోచమ్మ బోనాలను నిర్వహించారు. కార్యక్రమంలో ఇన్‌స్పెక్టర్‌ అశోక్‌, ఎంపీటీసీ చెన్నయ్య, సర్పంచ్‌లు అనితసురేందర్‌రెడ్డి, జంగయ్య, కుమ్మరి దర్శన్‌, గోవర్దన్‌రెడ్డి, శేఖర్‌గౌడ్‌, గణే్‌షగౌడ్‌, మాధవరెడ్డి, ప్రభాకర్‌గౌడ్‌, ఎం.వెంకటయ్య, రాఘవరెడ్డి, రాజేందర్‌రెడ్డి పాల్గొన్నారు. కందుకూరు మండలం లేమూరు, దాసర్లపల్లి, మాదాపురం, నేదునూరు గ్రామాల్లో బోనాలను జరుపుకున్నారు. మైసమ్మ, పోచమ్మ, ఎల్లమ్మ, మల్లన్న దేవతలకు బోనాలు సమర్పించారు. సర్పంచ్‌లు జె.పరంజ్యోతి, పి.బాలమణిఅశోక్‌, సాయిలు, రామక్రిష్ణారెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2022-08-15T05:55:24+05:30 IST