ప్రతి గ్రామానికి సీహెచ్‌సీ గ్రూపు

ABN , First Publish Date - 2022-01-20T05:10:48+05:30 IST

కాకినాడ రూరల్‌, జనవరి 19: ప్రతి గ్రామానికి ఒక కమ్యూనిటీ హైరింగ్‌ సెంటర్‌ (సీహెచ్‌సీ) గ్రూపు ఏర్పాటు చేయాలని వ్యవసాయ సంయుక్త సంచాలకులు ఎన్‌.విజయకుమార్‌ సూచించారు. కాకినాడ కృషి భవన్‌లో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో వ్యవసాయ యాంత్రీకరణ పఽథ

ప్రతి గ్రామానికి సీహెచ్‌సీ గ్రూపు
కాకినాడలో మాట్లాడుతున్న జేడీ విజయకుమార్‌

కాకినాడ రూరల్‌, జనవరి 19: ప్రతి గ్రామానికి ఒక కమ్యూనిటీ హైరింగ్‌ సెంటర్‌ (సీహెచ్‌సీ) గ్రూపు ఏర్పాటు చేయాలని వ్యవసాయ సంయుక్త సంచాలకులు ఎన్‌.విజయకుమార్‌ సూచించారు. కాకినాడ కృషి భవన్‌లో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో వ్యవసాయ యాంత్రీకరణ పథకంపై కోఆర్డినేషన్‌ సమావేశాన్ని కాకినాడ, కరప సబ్‌డివిజన్‌ ఏడీఏ పద్మశ్రీ అధ్యక్షతన బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జేడీ మాట్లాడుతూ రైతులకు యంత్ర పరికరాలను అందుబాటులోకి తీసుకురావాలని సిబ్బందిని ఆదేశించారు. రైతులు ఈ పథకంలో 40 శాతం వరకూ రాయితీ పొందవచ్చని తెలిపారు. సమావేశంలో కాకినాడ రూరల్‌, సామర్లకోట, పెదపూడి, కరప, కాజులూరు, తాళ్లరేవు మండలాలకు సంబంధించిన వ్యవసాయ సలహా మండలి చైర్మన్లు, ఏవోలు, డీసీసీబీ మేనేజర్లు పలు కంపెనీల ప్రతినిఽధులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-20T05:10:48+05:30 IST