విక్రమ్‌ గాళ్‌ఫ్రెండ్‌గా...?

ABN , First Publish Date - 2021-03-14T06:06:40+05:30 IST

విజయ్‌ దేవరకొండ నిర్మించిన ‘మీకు మాత్రమే చెప్తా’ చిత్రంలో కథానాయిక వాణీ భోజన్‌ గుర్తున్నారా? అందులో తరుణ్‌ భాస్కర్‌ ప్రేయసిగా, కాబోయే భార్యగా కనిపించారు. తమిళంలో ఆమెకు మంచి అవకాశం లభించింది. విక్రమ్‌, ఆయన తనయుడు ధృవ్‌

విక్రమ్‌ గాళ్‌ఫ్రెండ్‌గా...?

విజయ్‌ దేవరకొండ నిర్మించిన ‘మీకు మాత్రమే చెప్తా’ చిత్రంలో కథానాయిక వాణీ భోజన్‌ గుర్తున్నారా? అందులో తరుణ్‌ భాస్కర్‌ ప్రేయసిగా, కాబోయే భార్యగా కనిపించారు. తమిళంలో ఆమెకు మంచి అవకాశం లభించింది. విక్రమ్‌, ఆయన తనయుడు ధృవ్‌ హీరోలుగా ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. కార్తీక్‌ సుబ్బరాజు దర్శకత్వం వహిస్తున్నారు.  ఇందులో  వాణీ భోజన్‌ నటిస్తున్నట్టు దర్శకుడు చెప్పారు.  శనివారం చిత్రబృందం ఆమెకు స్వాగతం పలికింది. ఆమె విక్రమ్‌ గాళ్‌ఫ్రెండ్‌గా కనిపించనున్నారని టాక్‌. ఇది విక్రమ్‌ 60వ సినిమా. తండ్రీతనయులు కలిసి నటిస్తున్న తొలి సినిమా.

Updated Date - 2021-03-14T06:06:40+05:30 IST