వికాస్ దుబే మృతదేహానికి కరోనా పరీక్షలు... ఫలితం ఇదే!

ABN , First Publish Date - 2020-07-10T20:34:20+05:30 IST

కాన్పూర్: వికాస్ దుబే మృతదేహానికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఫలితం నెగెటివ్‌గా తేలింది. మరోవైపు కాన్పూర్ ఆసుపత్రిలో దుబే మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. పోస్ట్ మార్టం ప్రక్రియను వీడియో తీస్తున్నారు. దుబే శరీరంలో మొత్తం నాలుగు బుల్లెట్లున్నాయని వైద్యులు తెలిపారు.

వికాస్ దుబే మృతదేహానికి కరోనా పరీక్షలు... ఫలితం ఇదే!

కాన్పూర్: వికాస్ దుబే మృతదేహానికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఫలితం నెగెటివ్‌గా తేలింది. మరోవైపు కాన్పూర్ ఆసుపత్రిలో దుబే మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. పోస్ట్ మార్టం ప్రక్రియను వీడియో తీస్తున్నారు. దుబే శరీరంలో మొత్తం నాలుగు బుల్లెట్లున్నాయని వైద్యులు తెలిపారు. 


అంతకుముందు నిన్న ఉజ్జైన్ నుంచి దుబేను ప్రత్యేక వాహనంలో కాన్పూర్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలో యాక్సిడెంట్ అయింది. ఆ సమయంలో దుబే పోలీసుల దగ్గర్నుంచి 9ఎంఎం పిస్టల్ తీసుకుని పారిపోతూ కాల్పులు జరిపాడని అధికారులు తెలిపారు. ఎదురుకాల్పుల్లో దుబే హతమయ్యాడు. ఘటనలో కానిస్టేబుళ్లు, కమెండోలు గాయపడ్డారు. వారందరూ ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. 


జులై రెండున బిక్రూ గ్రామంలో దుబే గ్యాంగ్ జరిపిన కాల్పుల్లో డీఎస్పీ దేవేంద్ర మిశ్రాతో పాటు ముగ్గురు ఎస్‌ఐలు, నలుగురు కానిస్టేబుళ్లు చనిపోయారు. 

Updated Date - 2020-07-10T20:34:20+05:30 IST