Vikarabad టీఆర్ఎస్‎లో వర్గపోరు

ABN , First Publish Date - 2022-08-14T03:40:16+05:30 IST

టీఆర్ఎస్‌లో వర్గపోరు బయటపడింది. సీఎం కేసీఆర్ పర్యటన ఏర్పాట్లను మంత్రి సబితా.. ఎమ్మెల్సీ పట్నం వర్గీయులు విడివిడిగా..

Vikarabad టీఆర్ఎస్‎లో వర్గపోరు

వికారాబాద్ (Vikarabad): టీఆర్ఎస్‌ (Trs)లో వర్గపోరు బయటపడింది. సీఎం కేసీఆర్ (Cm Kcr) పర్యటన ఏర్పాట్లను మంత్రి సబితా.. ఎమ్మెల్సీ పట్నం వర్గీయులు విడివిడిగా పరిశీలించారు. ఈనెల 16న సీఎం కేసీఆర్ వికారాబాద్ జిల్లా కేంద్రంలో నూతన కలెక్టరేట్‌ను ప్రారంభించనున్నారు. ఈ మేరకు కలెక్టరేట్ భవన నిర్మాణ పనులను శరవేగంగా పూర్తి చేశారు. అయితే ఈ పనులను మంత్రి సబిత, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి విడివిడిగా పర్యవేక్షించడం చర్చనీయాంశమైంది. ఇక తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని మహేందర్ రెడ్డి అన్నారు. 

Updated Date - 2022-08-14T03:40:16+05:30 IST