Vikarabadలో క్షుద్ర పూజల కలకలం

ABN , First Publish Date - 2021-12-02T14:05:13+05:30 IST

జిల్లాలోని దోమ మండలం ఖమ్మం నాచారం సమీపంలో క్షుద్ర పూజలు కలకలం రేపుతున్నాయి.

Vikarabadలో క్షుద్ర పూజల కలకలం

వికారాబాద్: జిల్లాలోని దోమ మండలం ఖమ్మం నాచారం సమీపంలో క్షుద్ర పూజలు కలకలం రేపుతున్నాయి. కొందరు దుండగులు ముగ్గువేసి అందులో నిమ్మకాయలు, గుమ్మడి కాయలు, పసుపు కుంకుమ వేశారు. మరోపక్క కుండలో కళ్ళు, మేక తలకాయ, అన్నం, ఉడికించిన కందులు, కాల్చిన బట్టలు లభ్యమయ్యాయి. క్షుద్రపూజలు జరిగినట్టు ఓ రైతు గుర్తించి గ్రామస్థులకు తెలియజేశారు. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పూజలు జరిగి రెండు మూడు రోజులై ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు. ఈ ఘటనపై గ్రామస్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

Updated Date - 2021-12-02T14:05:13+05:30 IST