వైద్యం వికటించి బాలింత మృతి... కుటుంబసభ్యలు ఆందోళన

ABN , First Publish Date - 2022-06-03T15:26:26+05:30 IST

జిల్లాలోని తాండూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం వికటించి బాలింత మృతి చెందింది.

వైద్యం వికటించి బాలింత మృతి... కుటుంబసభ్యలు ఆందోళన

వికారాబాద్: జిల్లాలోని తాండూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం వికటించి బాలింత మృతి చెందింది. బషీరాబాద్ మండలం పర్ష్యా నాయక్  తాండకు చెందిన నందిని బాయి(23) అనే మహిళ గురువారం డెలివరి కోసం తాండూరు ప్రభుత్వం ఆసుపత్రికి వచ్చింది. డాక్టర్లు శస్ర్త చికిత్సతో మహిళకు కాన్పు చేశారు. అయితే రక్తశ్రావం ఆగకపోవడంతో పరిస్థితి విషమించింది. దీంతో తాండూరు వైద్యులు అర్ధరాత్రి మహిళను గాంధీ ఆస్పత్రికి తరలించారు. అయితే నందిబాయి చనిపోయిందని గాంధీ వైద్యులు తెలిపారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన మహిళ కుటుంబసభ్యులు మృతదేహంతో తాండూరు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. గర్భసంచిని తోలగించారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. బాలుడు పుట్టిన సంతోషాన్ని అనుభవించకముందే తల్లి చనిపోవడంతో కుటుంబసభ్యుల విషాదంలో మునిగిపోయారు. 

Updated Date - 2022-06-03T15:26:26+05:30 IST