రెండో అంతస్తు నుంచి పడి 18 నెలల చిన్నారి మృతి
ABN , First Publish Date - 2021-11-27T16:42:17+05:30 IST
జిల్లాలోని పరిగి పట్టణంలోని అయ్యప్ప కాలనిలో విషాదం చోటు చేసుకుంది.
వికారాబాద్: జిల్లాలోని పరిగి పట్టణంలోని అయ్యప్ప కాలనిలో విషాదం చోటు చేసుకుంది. 18 నెలల చిన్నారి వర్ణిక రెండో అంతస్తు నుంచి పడి మృతి చెందింది. పరిగి మండలం రాపోల్కు చెందిన సందీప్, ప్రశాంతి ఉద్యోగ రిత్యా పరిగి పట్టణంలో నివాసముంటున్నారు. చిన్న కూతురు వర్ణిక బాల్కనీలో ఆడుకుంటున్న సమయంలో ప్రమాదవశాత్తు క్రింద పడి మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.