చలానాలు భరించలేక బైక్‌పై పెట్రోల్‌ పోసి తగలబెట్టాడు

ABN , First Publish Date - 2021-08-09T02:36:05+05:30 IST

వికారాబాద్: వరుసగా వస్తున్న ట్రాఫిక్ చలానాలు భరించలేక సంగప్ప అనే యువకుడు తన బైక్‌పై పెట్రోల్‌ పోసి తగలబెట్టాడు. వికారాబాద్ జిల్లా పెద్దేముల్ గ్రామంలో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది.

చలానాలు భరించలేక బైక్‌పై పెట్రోల్‌ పోసి తగలబెట్టాడు

వికారాబాద్: వరుసగా వస్తున్న ట్రాఫిక్ చలానాలు భరించలేక సంగప్ప అనే యువకుడు తన బైక్‌పై పెట్రోల్‌ పోసి తగలబెట్టాడు. వికారాబాద్ జిల్లా పెద్దేముల్ గ్రామంలో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. టీఎస్ 34 డీ 2183 నెంబర్‌ గల ద్విచక్రవాహనంపై 5,500 రూపాయల చలానాలున్నాయి. కూలీగా పనిచేసే తాను ఇంత మొత్తాన్ని ఎలా కట్టగలనని సంగప్ప ప్రశ్నించాడు. ఆవేదనతోనే తాను బైక్‌ను తగలబెట్టానని చెప్పాడు. బైక్ తనకు అత్తింటివారు బహుమానంగా ఇచ్చారన్నాడు.  

Updated Date - 2021-08-09T02:36:05+05:30 IST