కుల్కచర్ల తహశీల్దార్ ఆఫీస్ వద్ద తల్లీకూతుళ్ల ఆత్మహత్యాయత్నం

ABN , First Publish Date - 2021-07-15T18:09:41+05:30 IST

జిల్లాలోని కుల్కచర్ల తహశీల్దార్ కార్యాలయం ముందు తల్లీకూతుళ్ల ఆత్మహత్యాయత్నం కలకలం రేపుతోంది.

కుల్కచర్ల తహశీల్దార్ ఆఫీస్ వద్ద తల్లీకూతుళ్ల ఆత్మహత్యాయత్నం

వికారాబాద్: జిల్లాలోని కుల్కచర్ల తహశీల్దార్ కార్యాలయం ముందు తల్లీకూతుళ్ల ఆత్మహత్యాయత్నం కలకలం రేపుతోంది. రాములమ్మ అనే మహిళ తన కూతురితో కలిసి పెట్రోలు పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తహశీల్దార్ తనను ఇబ్బందులు పెడుతున్నాడని రాములమ్మ ఆవేదన వ్యక్తం చేసింది. ఆర్థిక ఇబ్బందులతో 2017లో రాములమ్మ భర్త సాయిలు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ క్రమంలో ఆర్థిక సహాయం కింద 2019లో రాములమ్మకు ఐదు లక్షలు మంజూరు అయ్యాయి. కాగా తహశీల్దార్ మరియు రాములమ్మ పేరిట జాయింట్ అకౌంట్ ఉండటంతో డబ్బులు డ్రా చేసేందుకు తహశీల్దార్ ఇబ్బందులు పెడుతున్నాడని మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ క్రమంలో మనస్థాపంలో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే అక్కడి సిబ్బంది ఆమెను అడ్డుకున్నారు. 

Updated Date - 2021-07-15T18:09:41+05:30 IST