వికారాబాద్లో యువకుడు ఆత్మహత్య
ABN , First Publish Date - 2022-02-14T17:00:34+05:30 IST
జిల్లాలోని అనంతగిరి అడివిలోని వ్యూ పాయింట్ సమిపంలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.
వికారాబాద్: జిల్లాలోని అనంతగిరి అడివిలోని వ్యూ పాయింట్ సమిపంలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. సంగారెడ్డి జిల్లా సదాశివాపేట్కు చెందిన నవీన్ అనే వ్యక్తి ఉరివేసుకొని ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడి వద్ద ఉన్న సెల్ఫోన్ను స్వాధీనం చేసుకొని దర్యాప్తు చేపట్టారు. కాగా మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.