విజిలెన్స్ దాడులు
ABN , First Publish Date - 2020-09-22T07:55:15+05:30 IST
తాడిపత్రి పరిసర ప్రాంతాల్లోని 18 గ్రానైట్ కటింగ్, పాలిషింగ్ యూనిట్లపై విజిలెన్స్, గనులు, భూగర్భవనరుల అ ధికారులు సంయు
అనంతపురం క్రైం, సెప్టెంబరు 21: తాడిపత్రి పరిసర ప్రాంతాల్లోని 18 గ్రానైట్ కటింగ్, పాలిషింగ్ యూనిట్లపై విజిలెన్స్, గనులు, భూగర్భవనరుల అ ధికారులు సంయుక్తంగా సోమవారం దాడులు చేశారు. యూనిట్లలో పలు రికార్డులను పరిశీలించి, నిబంధనలు పాటించని వారికి నోటీసులు జారీ చేశారు.
తనిఖీల్లో విజిలెన్స్ ఎస్పీ రాఘవ, అధికారులు విశ్వనాథచౌదరి, డీసీటీఓ వెంకటసుబ్బారెడ్డి, ఎస్ఐ బాలకృష్ణయ్య, హెడ్ కానిస్టేబుల్ మారెన్న, మహేంద్ర, ముక్కనేశ్వర, ఆర్ఐ సాంబశివారెడ్డి, హుస్సేన్బేగం, కవిత, వరప్రసాద్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.