బెజవాడ వారధి వద్ద వైసీపీ ప్లెక్సీల కలకలం
ABN , First Publish Date - 2020-09-25T18:41:25+05:30 IST
బెజవాడ వారధి వద్ద వైసీపీ ప్లెక్సీల ఏర్పాటు కలకలం రేపుతున్నాయి.
విజయవాడ: బెజవాడ వారధి వద్ద వైసీపీ ప్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. రాజ్యాంగ వ్యవస్థల పేరుతో ప్రభుత్వానికి సంకెళ్లు వేస్తే చూస్తూ ఊరుకోం అంటూ వైసీపీ ఎమ్మెల్యే జోగిరమేష్ ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీంతో మరోసారి బహిర్గతంగా రాజ్యాంగ వ్యస్థలను వైసీపీ నేతలు టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే హైకోర్టుపై, న్యాయమూర్తుల తీర్పులను తప్పుబడుతూ సోషల్ మీడియా వేదికగా వైసీపీ నేతలు, సానుభూతిపరులు పోస్టింగ్లు పెట్టిన విషయం తెలిసిందే.