Vijayawada: నేడు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు
ABN , First Publish Date - 2021-10-13T13:12:28+05:30 IST
నేడు నగరంలో పోలీసులు ట్రాఫిక్ ఆక్షంలు విధించారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా విజయవాడ నగరంలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
విజయవాడ: నేడు నగరంలో పోలీసులు ట్రాఫిక్ ఆక్షంలు విధించారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా విజయవాడ నగరంలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంలోని ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం సందర్భంగా.. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఆర్టీసీ బస్సులు దారి మళ్లిస్తున్నట్లు తెలిపారు. పండిట్ నెహ్రూ బస్టేషన్ నుంచి కాళేశ్వరరావు మార్కెట్ ఆర్టీసీ బస్సులు, సిటీ బస్సులను పోలీస్ కంట్రోల్రూమ్ వైపు రాకపోకలను ఇతర మార్గాల ద్వారా ట్రాఫిక్ మళ్లింపు చేస్తున్నట్లు వెల్లడించారు.