కృష్ణా జిల్లాలో టీడీపీ నేతల హౌస్ అరెస్ట్

ABN , First Publish Date - 2021-10-20T13:50:58+05:30 IST

కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గం నాలుగు మండలాలో టీడీపీ నాయకులను తెల్లవారుజాము నుండే పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు.

కృష్ణా జిల్లాలో టీడీపీ నేతల హౌస్ అరెస్ట్

విజయవాడ: కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గం నాలుగు మండలాలో టీడీపీ నాయకులను తెల్లవారుజాము నుండే పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. ప్రధాన కూడలి వద్ద పోలీసులు పహారాకాస్తున్నారు. కాగా టీడీపీ బంద్‌కు ఎటువంటి అనుమతులు లేవని డీఎస్పీ నాగేశ్వర రెడ్డి తెలిపారు. ప్రజలు యధావిధిగా పనులు చేసుకోవచ్చారు. ఏ పార్టీ వారైన గొడవులు చేస్తే అరెస్టులు ఉంటాయని డీఎస్పీ హెచ్చరించారు. 


అటు మైలవరంలో భారీగా పోలీసులు మోహరించారు. మైలవరం, జి. కొండూరు, రెడ్డిగూడెం మండలాల్లో టీడీపీ నాయకులకు పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రధాన కూడళ్లలో పోలీసుల పహారా కాస్తున్నారు. రోడ్లపైకి వచ్చే నాయకులను వెంటనే అరెస్ట్ చేసేందుకు  పోలీసులు సిద్ధమవుతున్నారు. మహిళా పోలీసులకు కూడా డీఎస్పీ డ్యూటీ వేశారు. 

Updated Date - 2021-10-20T13:50:58+05:30 IST