TDP leader కొల్లు రవీంద్ర ఇంటి వద్ద ఉద్రిక్తత

ABN , First Publish Date - 2021-07-31T18:13:45+05:30 IST

టీడీపీ పొలిట్ బ్యూరో మెంబర్ కొల్లు రవీంద్ర ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది.

TDP leader కొల్లు రవీంద్ర ఇంటి వద్ద ఉద్రిక్తత

విజయవాడ: టీడీపీ పొలిట్ బ్యూరో మెంబర్ కొల్లు రవీంద్ర ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్‌లో అక్రమ మైనింగ్ పరిశీలనకు వెళుతున్న రవీంద్రను పోలీసులు అడ్డుకున్నారు. ఇంటి నుండి బయటకు వెళ్లేందుకు వీలు లేదని పోలీసులు తేల్చి చెప్పారు. ఎటువంటి నోటీలులు ఇవ్వకుండా అడ్డుకోవడం ఏమిటని పోలీసులను రవీంద్ర ప్రశ్నించారు. పోలీసుల తీరును తీవ్రంగా ఖండించారు. ఈ క్రమంలో పోలీసులు, రవీంద్ర మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వివాదం జరిగింది. రవీంద్రకు మద్దతుగా  కార్యకర్తలు భారీగా తరలి వచ్చారు. రవీంద్ర ఇంటి వద్ద భారీగా పోలీసులు మొహరించారు. దీంతో రవీంద్ర ఇంటి వద్దే బైఠాయించి ఆందోళన కొనసాగిస్తున్నారు.

Updated Date - 2021-07-31T18:13:45+05:30 IST