విజయవాడలో రోడ్డు ప్రమాదం...ఒకరు మృతి
ABN , First Publish Date - 2021-10-07T19:38:34+05:30 IST
విజయవాడ చత్తీస్గడ్ 30వ నెంబర్ జాతీయ రహదారిపై జి.కొండూరు మండలం విద్యానగరం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు.
విజయవాడ: విజయవాడ చత్తీస్గడ్ 30వ నెంబర్ జాతీయ రహదారిపై జి.కొండూరు మండలం విద్యానగరం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. టీవీఎస్ మోపెడ్ అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఖమ్మం జిల్లా ఎర్రుపాలెంకు చెందిన 40 ఏళ్ల వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.