కల్వర్టును ఢీకొని పల్టీలు కొట్టిన కారు...వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2022-06-08T17:48:49+05:30 IST

కృష్ణా జిల్లా బాపులపాడు మండలం అంపాపురం గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది.

కల్వర్టును ఢీకొని పల్టీలు కొట్టిన కారు...వ్యక్తి మృతి

విజయవాడ: కృష్ణా జిల్లా బాపులపాడు మండలం అంపాపురం గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. విజయనగరం నుండి విజయవాడ వెళ్తున్న స్విఫ్ట్ కారు అదుపుతప్పి కల్వర్టు గోడను ఢీకొని పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో మానేపల్లి లక్ష్మణరావు (22) అక్కడికక్కడే మృతి చెందగా.. మరో వ్యక్తి షేక్ బషిర్ (27) విజయవాడ ప్రభుత్వ  ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మరో ఇద్దరు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2022-06-08T17:48:49+05:30 IST