AP: పిన్నమనేని సిద్ధార్థ నర్సింగ్ కాలేజ్‌లో కరోనా కలకలం

ABN , First Publish Date - 2022-01-07T18:14:04+05:30 IST

కృష్ణా జిల్లా గన్నవరం మండలం చిన్నఆవుటపల్లిలోని పిన్నమనేని సిద్దార్థ నర్సింగ్ కాలేజీలో కరోనా కలకలం రేగింది.

AP: పిన్నమనేని సిద్ధార్థ నర్సింగ్ కాలేజ్‌లో కరోనా కలకలం

విజయవాడ: కృష్ణా జిల్లా గన్నవరం మండలం చిన్నఆవుటపల్లిలోని పిన్నమనేని సిద్ధార్థ నర్సింగ్ కాలేజీలో కరోనా కలకలం రేగింది. కాలేజీలో నర్సింగ్ కోర్సు చేస్తున్న ఆరుగురు విద్యార్థులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. వెంటనే వారిని పిన్నమనేనిలోని కరోనా సెంటర్‌కు తరలించారు. ఆరుగురితో కాంటాక్ట్ అయిన మరో 20 మంది విద్యార్థులను హాస్టల్‌లో ఐసోలేషన్ చేసిన కాలేజీ యాజమాన్యం... కాలేజీ మొత్తాన్ని శానిటైజేషన్ చేసింది. కరోనా పాజిటివ్ వచ్చిన ఆరుగురు కేరళకు చెందిన వారుగా గుర్తించారు. 

Updated Date - 2022-01-07T18:14:04+05:30 IST