ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసు.. నిందితులను కోర్టులో హాజరుపర్చిన పోలీసులు
ABN , First Publish Date - 2021-12-12T20:30:50+05:30 IST
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో ముగ్గురు నిందితులను సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు.
విజయవాడ: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో ముగ్గురు నిందితులను సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. ఏ6గా సౌమ్యాద్రి శేఖర్ బోస్, ఏ8గా వికాస్ కన్విల్కర్, ఏ10గా ముకుల్ అగర్వాల్ను ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు. వైద్య పరీక్షల అనంతరం వారిని ఏసీబీ కోర్టులో సీఐడీ అధికారులు హాజరుపర్చారు. ముగ్గురు నిందితులపై విచారణ జరిపిన న్యాయస్థానం వారికి 12 రోజులపాటు రిమాండ్ విధిస్తూ... తదుపరి విచారణ ఈనెల 24కు వాయిదా వేసింది. కాగా మరో నిందితుడు ఘంటా సుబ్బారావు అరెస్ట్పై అధికారులు స్పష్టత ఇవ్వలేదు. అసలు అరెస్ట్ చేసారా? లేదా? ఎక్కడైనా రహస్య ప్రాంతంలో విచారణ చేస్తున్నారా? అన్నదానిపై సందిగ్ధత నెలకొంది.