పట్టాభి కస్టడీ పిటిషన్ను కొట్టివేసిన కోర్టు
ABN , First Publish Date - 2021-10-28T18:19:06+05:30 IST
పట్టాభిని కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ను విజయవాడ కోర్టు కొట్టివేసింది.
విజయవాడ: టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిని కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ను విజయవాడ కోర్టు కొట్టివేసింది. ఇప్పటికే పట్టాభికి హైకోర్టు బెయిల్ ఇచ్చిన నేపథ్యంలో ఆయనను పోలీస్ కస్టడీకి ఇవ్వాలని కోరడం సమంజసం కాదని పట్టాభి తరఫు న్యాయవాది లక్ష్మినారాయణ వాదించారు. సీఎంకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు.. వాటి వెనక ఎవరున్నారనే అంశం తెలుసుకునే అవసరముందని పేర్కొంటూ ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదించారు. ఈ సమయంలో పట్టాభిని పోలీస్ కస్టడీకి ఇవ్వడం సమంజంకాదని, పైగా ఆయన చేసిన వ్యాఖ్యలు ముఖ్యమంత్రిని ఉద్దేశించి చేసినవికాదని లక్ష్మినారాయణ వాదించారు. ఇరువైపు వాదనలు విన్న న్యాయస్థానం పోలీసులు వేసిన కస్టడీ పిటిషన్ను డిస్మిస్ చేసింది.