సీఎం జగన్‌తో భేటీ కానున్న అక్కినేని నాగార్జున

ABN , First Publish Date - 2021-10-28T19:41:41+05:30 IST

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు అక్కినేని నాగార్జున గురువారం విజయవాడ వచ్చారు.

సీఎం జగన్‌తో భేటీ కానున్న అక్కినేని నాగార్జున

అమరావతి: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు అక్కినేని నాగార్జున గురువారం విజయవాడ వచ్చారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం వచ్చారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తాడేపల్లి జగన్ క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు. మరి కాసేపట్లో సీఎంతో భేటీ కానున్నారు. ఇరువురి సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. నాగార్జునతోపాటు ఐదుగురు నిర్మాతలు కూడా ఉన్నారు. ఇటీవల సినిమా పరిశ్రమ, ఏపీ ప్రభుత్వం మధ్య వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. కొన్ని సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నప్పటికీ ఈ వివాదం నేపథ్యంలో రిలీజ్ కాలేదు. ఇటువంటి వివాదం పరిశ్రమకు, ప్రభుత్వానికి మంచిదికాదని.. ముఖ్యంగా పరిశ్రమ నష్టపోతుందని భావిస్తూ సీఎంతో చర్చించేందుకు వచ్చినట్లు సమాచారం. అయితే పరిశ్రమ వర్గాలు గానీ, ఇటు ప్రభుత్వం నుంచి ఎవరూ ఈ సమాచారాన్ని ధృవీకరించలేదు.


Updated Date - 2021-10-28T19:41:41+05:30 IST