Kharif పంటకు నీరు విడుదల చేసిన మంత్రి Ambati
ABN , First Publish Date - 2022-06-10T19:52:50+05:30 IST
మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) ఖరిఫ్ (Kharif) పంటకు నీరు విడుదల చేశారు.
Vijayawada: రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) ఖరిఫ్ (Kharif) పంటకు నీరు విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఋతుపవనాలు ముందుగా వస్తున్నాయన్నారు. ఖరిఫ్ పంట ఈసారి బాగా రావాలని కోరుకుంటున్నాన్నారు. రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని అన్నారు. తనపై ఎన్ని కేసులు పెట్టిన భయపడేది లేదన్నారు. టీడీపీ వాళ్ళు పెడుతున్న కేసుల్లో వాస్తవం లేదని మంత్రి అంబటి అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు, మంత్రి జోగి రమేష్ , ఎమ్మేల్యే మల్లాది విష్ణు, మెరుగు నాగర్జున తదితరులు పాల్గొన్నారు.