మంత్రి బొత్స క్యాంపు ఆఫీసు ముట్టడికి ABVP యత్నం

ABN , First Publish Date - 2022-05-06T17:30:28+05:30 IST

మంత్రి బొత్స సత్యనారాయణ క్యాంపు కార్యాలయం ముట్టడికి ఏబీవీపీ కార్యకర్తలు పిలుపిచ్చారు.

మంత్రి బొత్స క్యాంపు ఆఫీసు ముట్టడికి ABVP యత్నం

Vijayawada: మంత్రి బొత్స సత్యనారాయణ క్యాంపు కార్యాలయం ముట్టడికి ఏబీవీపీ కార్యకర్తలు పిలుపిచ్చారు. దీంతో క్యాంప్ ఆఫీసు వద్ద భారీగా పోలీసులు మోహరించారు. మంత్రి బొత్స డౌన్ డౌన్ అంటూ ఏబీవీపీ కార్యకర్తలు నినాదాలు చేస్తూ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగి తోపులాట జరగడంతో పోలీసులు ఏబీవీపీ కార్యకర్తలను అరెస్టు చేసి పోలీస్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకులు మీడియాతో మాట్లాడుతూ పదో తరగతి పరీక్ష పేపర్ల లీకేజ్ విషయంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని విమర్శించారు. విద్యార్థులు జీవితాలతో జగన్ ప్రభుత్వం ఆటలాడుతోందని మండిపడ్డారు. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

Read more