AP News: దుర్గమ్మ ఆలయంలో అధికారుల నిర్లక్ష్యం
ABN , First Publish Date - 2022-09-26T15:06:48+05:30 IST
దేవిశరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గమ్మ ఆలయంలో అధికారుల నిర్లక్ష్యం వెల్లువెత్తుతోంది
విజయవాడ: దేవిశరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గమ్మ(Kanakadurgamma temple) ఆలయంలో అధికారుల నిర్లక్ష్యం వెల్లువెత్తుతోంది. అమ్మవారి ఆలయం ప్రాంగణంలో దేవీ నవరాత్రుల శోభ ఎక్కడా కనిపించని పరిస్థితి. అలంకారం లేక చిన్న రాజగోపురం వెలవెలబోతోంది. ఆలయ అధికారుల తీరుపై భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రతి ఏడాది ఆలయ ప్రాంగణాన్ని సుందరంగా ముస్తాబు చేయడం జరుగుతుంది. కానీ ఈ యేడు ఆలయ ప్రాంగణంలో పూలతో అలకరించకుండా.. కేవలం క్లాత్లు కట్టారు. చిన్న రాజగోపురం మీదుగా వీఐపీ, వీఐపీ భక్తులు అమ్మవారి ఆలయంలోకి ప్రవేశించనున్నారు. కాగా... ఉత్సవాల నిర్వహణకు మాత్రం దుర్గగుడి అధికారులు భారీగా బడ్జెట్ చూపుతున్నప్పటికీ ఏర్పాట్లలో నిర్లక్ష్యం కనిపిస్తోంది.