AP News: ఇంద్రకీలాద్రిపై తొలిరోజు నిలిచిన కరెంట్...భక్తులు ఇక్కట్లు

ABN , First Publish Date - 2022-09-26T13:43:53+05:30 IST

ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు మొదలయ్యాయి. కాగా.. తొలిరోజే ఆలయంలో కరెంట్ నిలిచిపోయింది.

AP News: ఇంద్రకీలాద్రిపై తొలిరోజు నిలిచిన కరెంట్...భక్తులు ఇక్కట్లు

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (Dussera Sharannavaratri celebrations)  మొదలయ్యాయి. కాగా.. తొలిరోజే ఆలయంలో కరెంట్ నిలిచిపోయింది. దాదాపు అరగంటకు పైగా కరెంట్ ఆగిపోవడంతో భక్తులు, అర్చకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు భవాని మాలలు వేసే ప్రాంగణం మొత్తం చీకటిమయంగా మారిపోయింది. ఇంద్రకీలాద్రి ఆలయ ప్రాంగణమంతా ఎక్కడికక్కడ మైకులు పనిచేయకుండా పోయాయి. మైకులు ఆగిపోవడంతో సరైన సమాచారం లేక భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. 

Updated Date - 2022-09-26T13:43:53+05:30 IST