దుర్గగుడిలో అవకతవకలపై ప్రభుత్వానికి నివేదిక

ABN , First Publish Date - 2021-02-24T17:34:46+05:30 IST

ప్రముఖ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై దుర్గగుడిలో జరిగిన అవకతవకలపై ప్రభుత్వానికి దేవాదాయశాఖ ఉన్నతాధికారులు నివేదిక ఇచ్చారు.

దుర్గగుడిలో అవకతవకలపై ప్రభుత్వానికి నివేదిక

విజయవాడ: ప్రముఖ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై దుర్గగుడిలో జరిగిన అవకతవకలపై ప్రభుత్వానికి దేవాదాయశాఖ ఉన్నతాధికారులు నివేదిక ఇచ్చారు. ఉద్యోగులు, ఈఓపై ప్రభుత్వానికి  పూర్తిస్ధాయి నివేదిక అందింది. ఇప్పటికే 15 మంది ఉద్యోగులను అధికారులు సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎవరి పాత్ర ఎంతో దానికి సంబంధించిన నివేదికను ప్రభుత్వానికి  దేవాదాయశాఖ ఉన్నతాధికారులు అందజేశారు. దుర్గగుడిలో అవినీతిపై దేవాదాయ శాఖకు  ఏసీబీ నివేదిక అందించిన విషయం తెలిసిందే. మరో రెండురోజుల్లో మరికొందరికి చర్యలు తీసుకొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దుర్గగుడి ఈఓపై బదిలీవేటు పడే అవకాశం ఉన్నట్లు సమాచారం. 

Updated Date - 2021-02-24T17:34:46+05:30 IST