AP News: ‘నీకు నచ్చింది చేసుకో’... ఇంద్రకీలాద్రిపై పోలీసుల దురుసు ప్రవర్తన
ABN , First Publish Date - 2022-09-28T16:32:46+05:30 IST
దేవి శరన్నవరాత్ర మహోత్సవాల సందర్భంగా ఇంద్రకీలాద్రిపై పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు.
విజయవాడ: దేవి శరన్నవరాత్ర మహోత్సవాల సందర్భంగా ఇంద్రకీలాద్రిపై పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఆలయ స్థానాచర్య, ప్రధానర్చకులను పోలీసులు అడ్డుకున్నారు. డ్యూటీ పాస్ చూపించినప్పటికీ ‘‘నీకు నచ్చింది చేసుకో’’ అంటూ వారి పట్ల దురుసుగా ప్రవర్తించారు. పోలీసుల తీరుపట్ల అర్చకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈఓ చెప్తేనే తాళాలు వేశామని పోలీసులు చెబుతున్నారు. కలెక్టర్ ఆదేశాలతో ఖాకీలు ఆలయాన్ని స్వాధీనం చేసుకున్నారు. కాగా... ఆలయంలో ఎక్కడికక్కడ అడ్డుకుని ఏకవచనంతో మాట్లాడుతున్నారని అర్చకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.