AP News: ఇంద్రకీలాద్రిపై పోటెత్తిన భక్తులు

ABN , First Publish Date - 2022-08-19T17:18:09+05:30 IST

శ్రావణ మాసం నాల్గవ శుక్రవారం కావడంతో ఇంద్రకీలాద్రిపై భక్తులు పోటెత్తారు.

AP News: ఇంద్రకీలాద్రిపై పోటెత్తిన భక్తులు

విజయవాడ: శ్రావణ మాసం నాల్గవ శుక్రవారం కావడంతో ఇంద్రకీలాద్రిపై భక్తులు పోటెత్తారు. అమ్మవారిని దర్శించుకొని భక్తులు తరిస్తున్నారు. నాల్గవ శుక్రవారం కావడంతో అమ్మవారి మహామండపంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించారు.  పెద్ద ఎత్తున మహిళా భక్తులు పాల్గొన్నారు.  ముత్తయిదలు అమ్మవారికి పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సామూహిక వరలక్ష్మి వ్రతాలు వైభవంగా సాగుతున్నాయని దుర్గగుడి ఈవో  బ్రమరాంబ తెలిపారు. అమ్మవారి చెంత వరలక్ష్మి దేవి వ్రతాలకు అనూహ్య స్పందన వచ్చిందన్నారు. దాదాపు 500 మందికి పైగా మహిళా ‌భక్తులు వ్రతం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అప్లికేషన్స్ లేనివారిని వ్రతానికి అనుమతించామన్నారు. అమ్మవారి అనుగ్రహం ప్రతిఒక్కరిపై ఉండాలని కోరుకుంటున్నట్లు ఈవో బ్రమరాంబ తెలిపారు. 

Updated Date - 2022-08-19T17:18:09+05:30 IST