విజయవాడ ఘటన బాధాకరం: ఉషా శ్రీచరణ్‌

ABN , First Publish Date - 2022-04-24T00:08:32+05:30 IST

విజయవాడలో జరిగిన ఘటన బాధాకరమని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషా శ్రీచరణ్‌ అన్నారు.

విజయవాడ ఘటన బాధాకరం: ఉషా శ్రీచరణ్‌

కల్యాణదుర్గం: విజయవాడలో జరిగిన ఘటన బాధాకరమని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషా శ్రీచరణ్‌ అన్నారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడారు. మతిస్థిమితంలేని యువతిపై దుండగులు అఘాయిత్యానికి పాల్పడడం హేమమైన చర్య అని అన్నారు. ఆ ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని చెప్పారు. ఈ ఘటనపై సీఎం జగన్‌, మంత్రులు వెంటనే స్పందించామని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించామని తెలిపారు. సకాలంలో స్పందించని ఎస్‌ఐ, సీఐని సస్పెండ్‌ చేశామని పేర్కొన్నారు. బాధిత కుటుంబానికి రూ.10లక్షలు పరిహారం అందిస్తామని తెలిపారు. రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌ పర్సన్‌ వాసిరెడ్డి పద్మ పట్ల ఆసుపత్రిలో టీడీపీ నాయకులు వ్యవహరించిన తీరు అభ్యంతరకరమని ఉషా శ్రీచరణ్‌ తప్పుబట్టారు.

Updated Date - 2022-04-24T00:08:32+05:30 IST