Vijayawada: మద్యం తాగి విధులకు హాజరైన ఎమ్ఎన్ఓ

ABN , First Publish Date - 2022-05-27T19:32:54+05:30 IST

నగర ప్రభుత్వ హాస్పిటల్లో దారుణం చోటు చేసుకుంది. ఎమ్ఎన్ఓ సోమరాజు మద్యం తాగి విధులకు హాజరయ్యారు.

Vijayawada: మద్యం తాగి విధులకు హాజరైన ఎమ్ఎన్ఓ

విజయవాడ: నగర ప్రభుత్వ హాస్పిటల్లో దారుణం చోటు చేసుకుంది.  ఎమ్ఎన్ఓ సోమరాజు మద్యం తాగి విధులకు హాజరయ్యాడు. మద్యం మత్తులో నర్సులు, నర్సింగ్ సూపరింటెండెంట్పై దురుసుగా ప్రవర్తించిన సోమరాజు... అసభ్య పదజాలంతో నర్సులను దూషించాడు. సోమరాజు‌ తీరుతో ఆసుపత్రి రోగులు భయాందోళనకు గురయ్యారు. గతంలోనూ సోమరాజు మద్యం తాగి విధులకు హాజరైనట్లు ఆస్పత్రి సిబ్బంది తెలిపారు. పలుమార్లు ఆసుపత్రి సిబ్బంది హెచ్చరించినా సోమరాజు తీరుమార్చుకోలేదు. సీఎం కాన్వాయ్ అంబులెన్స్లో సోమరాజు ఎమ్ఎన్ఓగా పనిచేస్తున్నాడు. 

Updated Date - 2022-05-27T19:32:54+05:30 IST