గంట నుంచి గాల్లో తిరుగుతున్న స్పైస్జెట్, ఎయిర్లైన ఫ్లైట్స్
ABN , First Publish Date - 2021-02-27T14:56:37+05:30 IST
గన్నవరం ఎయిర్పోర్టు వద్ద రెండు విమానాలు గాల్లో చక్కర్లు కొడుతున్నాయి.
విజయవాడ: గన్నవరం ఎయిర్పోర్టు వద్ద రెండు విమానాలు గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. పొగమంచు కారణంగా విమానాల ల్యాండింగ్కు ఏటీసీ సిగ్నల్ ఇవ్వకపోవడంతో గంట నుంచి స్పైస్జెట్, ఎయిర్లైన్ ఫ్లైట్స్ గాల్లో తిరుగుతున్నాయి. స్పైస్ జెట్ ఎస్జీ 3417 విమానం బెంగళూరు నుంచి గన్నవరానికి వచ్చింది. విమానంలో మొత్తం 67 మంది ప్రయాణికులు ఉన్నారు. అలాగే ఎయిర్ ఇండియా విమానం ఢిల్లీ నుంచి గన్నవరంకు వచ్చింది.