దుర్గమ్మ ఆలయంలో పోలీసు అధికారిపై మంత్రి వెల్లంపల్లి ఆగ్రహం
ABN , First Publish Date - 2021-10-13T16:13:46+05:30 IST
ఇంద్రకీలాద్రిపై విధులు నిర్వహిస్తున్న పోలీస్ అధికారిపై మంత్రి వెల్లంపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు.
విజయవాడ: ఇంద్రకీలాద్రిపై విధులు నిర్వహిస్తున్న పోలీస్ అధికారిపై మంత్రి వెల్లంపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. దర్శనానికి వెళుతున్న సమయంలో మంత్రి వెల్లంపల్లిని సీఐ గుర్తుపట్టలేదు. దీంతో ఏయ్ పక్కకు తొలుగు అంటూ సీఐపై మంత్రి మండిపడ్డారు. అమ్మవారి దర్శనం చేసుకొని డీజీపీ గౌతమ్ సవాంగ్ వస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కాగా మంత్రి తీరును పోలీసులు తప్పుబడుతున్నారు.