AP: భవానీ భక్తులతో ఎరుపెక్కిన ఇంద్రకీలాద్రి పర్వతం

ABN , First Publish Date - 2021-10-14T14:29:49+05:30 IST

ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. భవానీ భక్తులతో ఇంద్రకీలాద్రి పర్వతం ఎరుపుమయంగా మారింది.

AP: భవానీ భక్తులతో ఎరుపెక్కిన ఇంద్రకీలాద్రి పర్వతం

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. భవానీ భక్తులతో ఇంద్రకీలాద్రి పర్వతం ఎరుపుమయంగా మారింది. దేవీ నవరాత్రుల సందర్భంగా భవానీలు  నవరత్న మాల వేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు పలు రాష్ట్రాల నుంచి దుర్గమ్మ దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భవానీలు వస్తున్నారు. మూడు రోజుల పాటు భవానిల తాకిడి ఉండే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. దీంతో  విజయదశమికి చేసిన ఏర్పాట్లు మరో రెండురోజుల పాటు పొడిగించనున్నారు. 

Updated Date - 2021-10-14T14:29:49+05:30 IST