AP: ఇంద్రకీలాద్రిపై భక్తుల అసంతృప్తి

ABN , First Publish Date - 2021-10-10T16:09:02+05:30 IST

ఇంద్రకీలాద్రిపై 300 రూపాయల‌ టికెట్‌ను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసిన భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

AP: ఇంద్రకీలాద్రిపై భక్తుల అసంతృప్తి

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై 300 రూపాయల‌ టికెట్‌ను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసిన భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఫ్రీ దర్శనంతో సమానంగా 300 రూపాయల దర్శనం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. నడవలేని వారి కోసం తీసుకునే 300 రూపాయల టికెట్టుకు కూడా ఫ్రీ దర్శనంతో సమానంగా దర్శనం కల్పిస్తున్నారని ఆరోపించారు. వీఐపీ, వీవీఐపీలకు ఆలయ సిబ్బంది పెద్దపీట వేస్తోందని, సామాన్య భక్తులను అధికారులు పట్టించుకోవడం లేదంటూ భక్తులు ఆవేదన చెందుతున్నారు. 

Updated Date - 2021-10-10T16:09:02+05:30 IST