దుర్గమ్మ ఆలయంలో పాలకమండలి సమావేశం ప్రారంభం
ABN , First Publish Date - 2021-06-21T17:43:16+05:30 IST
ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ ఆలయంలో పాలకమండలి సమావేశం సోమవారం ఉదయం ప్రారంభమైంది.
విజయవాడ: ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ ఆలయంలో పాలకమండలి సమావేశం సోమవారం ఉదయం ప్రారంభమైంది. దాదాపు 42 ఎజెండాలతో కూడిన ప్రతిపాదనలు పాలకమండలి ముందు ఉన్నాయి. ప్రధానంగా 20 అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు. ఆలయ అభివృద్ధి పనులు, టెండర్ల అవకతవకలు, నూతన నిర్మాణాలు, దసరా ఉత్సవాలు గురించి చర్చించే అవకాశం ఉంది. ప్రభుత్వం విడుదల చేసిన రూ.72 కోట్లను ఆలయంలో ఏ అభివృద్ధి పనులకు ఉపయోగించాలనే దానిపై పాలకమండలి చర్చించనున్నట్లు తెలుస్తోంది. దుర్గగుడి ఈవో భ్రమరాంబ, చైర్మన్ పైలా సోమినాయుడు, పాలక మండలి సభ్యులు సమావేశంలో పాల్గొన్నారు.