దుర్గమ్మను దర్శించుకున్న డిప్యూటీ సీఎం ధర్మాన
ABN , First Publish Date - 2021-12-19T19:46:24+05:30 IST
ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మను డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ కుటుంబసమేతంగా దర్శించుకున్నారు.
విజయవాడ: ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మను డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎంకు అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానంతరం వేద పండితుల చేత వేద ఆశీర్వచనం పొందారు. అనంతరం ధర్మానకు అమ్మవారి ప్రసాదములు, చిత్రపటాన్ని ఆలయ ఈవో అందజేశారు.