దివ్య తేజస్వి హత్య కేసులో కీలక పురోగతి
ABN , First Publish Date - 2020-10-19T13:07:49+05:30 IST
బీటెక్ విద్యార్థిని దివ్యతేజస్వి హత్య కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. నాగేంద్రే హంతకుడిగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు.
విజయవాడ: బీటెక్ విద్యార్థిని దివ్యతేజస్వి హత్య కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. నాగేంద్రే హంతకుడిగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. దివ్య తేజస్వితో దిగిన ఫోటో మార్ఫింగ్గా పోలీసులు గుర్తించారు. ఘటన జరిగిన సమయానికి నిద్ర లేవగానే దివ్య తేజస్విని గదిలోకి వెళ్ళి గడియ పెట్టిన నిందితుడు ఆ తర్వాతే ఆమెపై కత్తితో దాడి చేశాడు. తలుపులు తీయక పోవడంతో తేజస్వి తల్లి కేకలు వేసింది. అప్పటికి అతనికి చిన్న గాయాలే అయ్యాయని...ఆసుపత్రికి తరలిస్తుండగా గొంతు కోసుకుని నాటకం ఆడినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఈ కేసును దిశ పోలీస్స్టేషన్కు వెళ్లింది.